అన్నమయ్య: అడవిలో తండ్రి హత్య.. రాత్రంతా మృతదేహం పక్కనే ఉన్న ఐదేళ్ల కొడుకు..!

2 months ago 13
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. చౌడేపల్లి మండలంలోని బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడు వాసి మృతదేహం లభ్యమైంది. మద్యం మత్తులో అతణ్ని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాత్రంతా తండ్రి మృతదేహం పక్కనే ఉన్న అతని ఐదేళ్ల కుమారుడు.. ఉదయాన్నే అటవీ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చి స్థానికులకు విషయం చెప్పటంతో ఈ దారుణం వెలుగుచూసింది. మరోవైపు ఈ ఘటనకు వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Entire Article