అన్నంలో విషంపెట్టి ముగ్గురు పిల్లల్ని చంపిన తల్లి..?

1 year ago 28
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ రాఘవేంద్ర కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా బిడ్డల్ని కాచుకోవాల్సిన కన్నతల్లే వారిపట్ల కర్కషంగా వ్యవహరించింది. అన్నంలో విషం పెట్టి ముగ్గురు పిల్లల్ని చంపేసింది. ఆపై తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల కారణంగానే పిల్లల్ని చంపి ఆపై తల్లి కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Read Entire Article