Kakarla Venkata Rami Reddy AP High Court Petition: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆయన్ను డిస్మిస్ చేయగా.. హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. విచారణజరిగింది. ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.