అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసగా మారి రోజు వేధిస్తున్న కొడుకును తల్లే హత్య చేసింది. కత్తెరతో పొడిచి చంపేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతపురం త్రీటౌన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. సురేంద్ర అనే 28 ఏళ్ల యువకుడిని అతని తల్లి సునీతమ్మ హత్య చేసింది. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది సునీతమ్మ.