అటవీ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్.. ఏ1గా జనసేన నేత..!

11 months ago 22
అటవీశాఖ ఉద్యోగులపై టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డిపై శ్రీశైలం పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేసు నమోదుచేశారు. అయితే ఈ కేసులో ఏ-1గా శ్రీశైలం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రౌతు అశోక్‌ను పోలీసులు ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. ఈయనే ప్రధాన నిందితుడని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ-2గా చూపారు. రౌతు అశోక్‌ జనసేన నాయకుడైనా.. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉంటారని అంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఎమ్మెల్యేతోపాటు ఆయనా ఉన్నారని.. ఉద్యోగులపై దాడిచేశారని బాధితులు పోలీసులకు వివరించారు. దీంతో గురువారం అశోక్‌ను కూడా పిలిపించి పోలీసులు విచారణ చేశారు.
Read Entire Article