అక్క కోసం వెళ్తే.. బావమరుదులను శూలంతో పొడిచి చంపిన బావ..

1 year ago 25
అల్లూరి ఏజెన్సీలో సీలేరులో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు బావమరుదులను బావ హతమార్చాడు. హత్యను అడ్డుకోవడానికి వెళ్లిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో జీకే వీధి మండలం చింతపల్లి క్యాంపుకు చెందిన వంతల గెన్ను భార్య మణిని సక్రమంగా చూసుకోవడం లేదని బావమరిది లు కిముడు కృష్ణ (36) , కిమ్ముడు రాజు (36) గెన్ను ను నిలదీసి అడగడంతో ఘర్షణ మొదలైంది. బావ గెన్ను బావమరిదిలు కిముడు కృష్ణ , కిమ్ముడు రాజుకు ఫుల్లుగా మద్యం తాగించి శూలంతో పొడిచి హత్య చేశాడు. ఘర్షణ అడ్డుకోవడానికి వెళ్లిన చిన్న రాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలను పోలీసుకు సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు హత్యకు గురి కావడంతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
Read Entire Article