YSRCP: వైసీపీ 2.0లో వీరికే పదవులు.. తేల్చేసిన జగన్

9 months ago 16
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మంగళవారం వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో ఏపీలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని ఆరోపించారు. న్యాయం, ధర్మం కనిపించడం లేదని.. తప్పుడు కేసులు, సాక్ష్యాలతో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కేసులలో బాధితుల తరఫున నిలబడాలని వైఎస్ జగన్ సూచించారు. న్యాయవాదుల సేవలను మరిచిపోమని.. వచ్చే వైఎస్ జగన్ 2.0 ప్రభుత్వంలో పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యం ఇస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పార్టీకి పనిచేసే వారి కోసం డేటాబేస్‌ పెడుతున్నామని.. దీని ఆధారంగా గుర్తింపు, ప్రాధాన్యత ఉంటుందన్నారు. మరి కొద్ది రోజుల్లో యాప్‌ కూడా విడుదల చేస్తామని వైఎస్ జగన్ వివరించారు.
Read Entire Article