YSRCP: జగన్ 2.0.. ఈ సారి కథ వేరే.. వెంట్రుక కూడా పీకలేరు!

1 year ago 38
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పొరేటర్లతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బతుకుతుందీ, రాష్ట్రాన్ని ఏలుతుందన్న జగన్.. 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటామన్నారు. తొలిసారి మాదిరిగా కాకుండా ఈసారి కార్యకర్తలకు కూడా ప్రాధాన్యం ఇస్తానని.. ఎవరూ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జగన్ 2.0 చూస్తారన్న వైఎస్ జగన్.. అది వేరేలా ఉంటుందని అన్నారు.
Read Entire Article