YS Jagan: ఇంత దగా, మోసమా?.. మరీ ఇంత గ్రాంటెడ్‌గా తీసుకుంటారా బాబుగారూ..!

1 year ago 29
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో వైఎస్ జగన్ మండిపడ్డారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయకుండా లీకులు వదులుతూ కాలయాపన చేస్తున్నారని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పథకాలు అమలు చేసే వరకూ ప్రజల తరుపున పోరాడతామని స్పష్టం చేశారు.
Read Entire Article