ఏపీ ప్రజలకు అలర్ట్.. మరికొన్ని గంటల్లో ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే సోమవారం రోజున ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే రైతులు పంటలు తడవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.