ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాలలో వానలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కొన్ని జిల్లాలలో తీవ్రవడగాలుల అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. రైతులు, కూలీలు, పశువుల కాపర్లు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.