విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడు బస్సులు దగ్ధమయినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మూడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు.