విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన బాలసాయి శ్రావణ్ కుమార్ బీటెక్ చదివి ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాడు. 2020లో ఎంఎస్ కోసం యూకే వెళ్లాడు. ఆరేళ్ల పాటు అక్కడే ఉన్న శ్రావణ్ వీసా గడువు పూర్తవడంతో ఇటీవలే తిరిగి వచ్చాడు. అయితే, ఉన్నత చదువుల కోసం వెళ్లిన శ్రావణ్ కుమార్ అక్కడ డ్రగ్స్కు బానిసయ్యాడు. విజయవాడ వచ్చిన తర్వాత కూడా దాన్ని వదల్లేకపోయాడు. దాంతో బెంగళూరు నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ను తీసుకొస్తూ పట్టుబడ్డాడు.