ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 2017లో ఈ సారె మహోత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 26న బంగారు బోనం, సారెను దుర్గామల్లేశ్వరస్వామికి సమర్పించనున్నారు. ఈ నెల 15న మొదటి సారెను ఆలయ అర్చకులు, వేద పండితులు కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించనున్నారు. 25న దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆగస్టు 12న దుర్గగుడి ఈఓ శీనానాయక్, ఆలయ సిబ్బంది సారెను సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.