Vangalapudi Anitha: పొలంలోకి దిగి వరినాట్లు వేసిన హోం మంత్రి..

11 months ago 22
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పొలంలోకి దిగారు. వరినాట్లు నాటారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి అనిత.. గజపతినగరం రైల్వే స్టేషన్ రోడ్డు పురిటిపెంట గ్రామంలో వరినాట్లు వేస్తున్న రైతులను పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి పంట పొలంలో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం గురించి వివరించారు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు ఖాతాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ప్రతి ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుున్నాయనే సంగతిని వారికి తెలియజేశారు.
Read Entire Article