TTD: తిరుమలలో అపచారం.. టీటీడీ సీరియస్..

1 year ago 28
తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చెప్పులతో భక్తులు ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఇందులో ఇద్దరు టీటీడీ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. మరో ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బందిపై చర్యలకు ప్రతిపాదనలు పంపింది. మహారాష్ట్ర భక్తులు శ్రీవారి దర్శనానికి చెప్పులతో రావడంతో ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది తనిఖీ చేయకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
Read Entire Article