Tirupati: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆక్టోపస్ బలగాలు.. ఏమైందంటే?

1 year ago 37
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఆలయంలో మాక్ డ్రిల్ చేశారు. ఉగ్రవాదులు, ముష్కరులు ఆలయంలోకి చొరబడితే ఎలా ఎదుర్కోవాలి, వారిని ఎలా ప్రతిఘటించాలనే దానిపైనా డ్రిల్ చేపట్టారు. అలాగే ఆపద సమయంలో భక్తులను ఎలా రక్షించాలనే విషయాలపై మాక్ డ్రిల్ కొనసాగింది. పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, పర్యాటక ప్రాంతాల్లో ఆక్టోపస్ దళాలు ఇలా మాక్ డ్రిల్ నిర్వహించడం సర్వసాధారణం.
Read Entire Article