వీకెండ్ కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ.. క్యూలైన్లలోకి భక్తులను అనుమతించడం లేదు. మరోవైపు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. అటు భక్తుల రద్దీతో టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ శనివారం ఉదయం ఐదింటికే జారీ చేసింది.