Tirumala Darshan: తిరుమల శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

1 year ago 36
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ‌ ప్రముఖులు తరలివచ్చారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన భార్య నిక్కీ గల్రాని ప్రత్యేకంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Read Entire Article