TG: శుభవార్త చెప్పిన మంత్రి ఉత్తమ్.. వారికి 25 శాతం అదనపు జీతం ప్రకటన..

6 months ago 18
నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారమైన ఎస్ఎల్‍బీసీ (SLBC) సొరంగం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మిగిలి ఉన్న 9.8 కిలోమీటర్ల తవ్వకాల్లో టీబీఎం యంత్రాలకు బదులుగా ఆధునిక సాంకేతికతను వాడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే పూర్తి చేశామని.. పనుల వేగం పెంచేందుకు సొరంగం ఇరువైపుల నుండి తవ్వకాలు చేపడుతున్నామని చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బందికి 25 శాతం అదనపు వేతనం ఇస్తామని.. ప్రతి సోమవారం పనుల పురోగతిని పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.
Read Entire Article