TG: ఆ జిల్లా ఆసుపత్రిలో దారుణం.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టేశారు.. ఉదయం కదులుతుండగా..

8 months ago 12
మహబూబాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మూడు రోజుల క్రితం చికిత్స కోసం వచ్చిన రాజును.. తోడుగా ఎవరూ లేరనే కారణంతో సిబ్బంది చేర్చుకోలేదు. ఆస్పత్రి ఆవరణలో అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని చనిపోయాడని పొరబడి మార్చురీలో ఉంచారు. ఉదయం మార్చురీ శుభ్రం చేస్తూ రాజు కదులుతున్నాడని గమనించిన స్వీపర్‌ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు స్పందించి రాజును ఏఎంసీ వార్డులో చేర్పించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ వైద్యసేవల నాణ్యతపై ప్రశ్నలు లేపుతున్నారు.
Read Entire Article