మహానాడులో బక్కని నర్సింలు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని స్పష్టం చేశారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా అంతా ఒకటేనని తేల్చి చెప్పారు. ఎవరైనా సరే ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని నేతలందరికీ చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.