తమిళనాడు మూడేళ్ల ప్రయత్నాలకు బ్రేక్ వేస్తూ ఏపీ భారీ ప్రాజెక్టు సొంతం చేసుకుంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శుక్రవారం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వం డీఆర్డీవో మూడేళ్ల నుంచి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. హోసూరు సమీపంలో ఈ ప్రాజెక్టు నెలకొల్పేందుకు చర్యలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించి ఈ ప్రాజెక్టును ఏపీ దక్కించుకుంది.