ఎస్ఐఆర్ అప్లికేషన్ పేరుతో మహిళను నమ్మించి ఇద్దరు దుండగులు సుమారు 3 తులాల బంగారు పుస్తెలతాడును అపహరించారు. ఫోటో తీయాలని చెప్పి మహిళను కొంత దూరం తీసుకెళ్లి బంగారు గొలుసును తీసుకుని బైక్పై పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు.