హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలలో గత ఎన్నికల్లో ఓటేసిన 20 నుంచి 25 శాతం మంది ఓటర్ల పేర్లు తాజా జాబితాలో మాయమయ్యాయి. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఆన్లైన్లో వెతకగా.. నో రిజల్ట్ ఫౌండ్ అని వస్తుంది. దానికి తోడు బీఎల్వోలు ఫారమ్లు ఇవ్వలేదని నివాసితులు వాపోతున్నారు. సరైన అడ్రస్, ఫోటోలు లేకపోవడంతో శేరిలింగంపల్లిలో 35 వేలు, రాజేంద్రనగర్లో 70 వేల ఫారమ్లు బీఎల్వోల వద్దే ఉండిపోయాయి. రాష్ట్రంలో 100 శాతం ఫారమ్ల పంపిణీ పూర్తయిందని సీఈవో డేటా చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఓటర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.