School Bandh: విద్యార్థులకు ముఖ్య గమనిక.. ఏపీలో రేపు ప్రైవేట్ స్కూళ్లు బంద్..!

11 months ago 20
Andhra Pradesh private schools bandh: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల విద్యార్థులకు ముఖ్య గమనిక. రేపు (గురువారం) ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించనున్నాయి. కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరుతో వేధిస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ఆరోపించింది. దీనికి నిరసనగా గురువారం (జులై 3) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించనున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇప్పిటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్య అసోసియేషన్ కోరింది.
Read Entire Article