పుంగనూరు నియోజకవర్గ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇంఛార్జి ఎంపికపై మంత్రుల సమక్షంలో జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల ఇంఛార్జిల ఎంపికపై తిరుపతిలోని ఓ హోటల్లో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్ధన్ రెడ్డి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు తన్నుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.