Pensions: తెలంగాణలో ఆసరా పింఛన్ల పెంపుపై కదలిక.. ముందుగా వారికే.. మంత్రి కీలక ప్రకటన..

6 months ago 21
తెలంగాణలో దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని.. త్వరలోనే ఆసరా పింఛన్ల పెంపు ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 44 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఎన్నికల హామీ ప్రకారం.. వృద్ధులు, ఇతరులకు ఇచ్చే రూ. 2,016 పింఛనును రూ. 4,000కు, అలాగే దివ్యాంగులకు ఇచ్చే రూ. 4,016 పింఛనును రూ. 6,000కు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పింఛన్లతో పాటు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, అంధ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు, ఉచితంగా సహాయక పరికరాల పంపిణీ వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుందన్నారు.
Read Entire Article