Pawan kalyan: వారికి ఆధార్, పాన్ కార్డులు ఎలా వచ్చాయ్?

1 year ago 28
రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రోహింగ్యాలు మన దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరు పాత్ర ఉందని ఆరోపించారు. గతంలో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు విపరీతంగా రోహింగ్యాలు వలసదారులు వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. 2017-18 ప్రాంతాల్లో కోల్ కతా నుంచి స్వర్ణకార వృత్తి నిమిత్తం చాలామంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వచ్చారని.. వారి వలసలతో స్థానిక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటోందన్నారు. రోహింగ్యాలు దేశం దాటి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునేలా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు పొందుతున్నారన్న పవన్ కళ్యాణ్.. మన యువతకు చెందాల్సిన ఉద్యోగాలు, వ్యాపారాలు వారు చేసుకుంటున్నారని ఆరోపించారు. రోహింగ్యాలు స్థిర నివాసం ఏర్పరుచుకోవడంలో మన యంత్రాంగం నిర్లక్ష్యం ఉందని.. వారికి ఎలా ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎవరు ఇస్తున్నారనేది తేలాలని.. మన వ్యవస్థలోనే కొందరు వ్యక్తులు వారికి సహకరిస్తున్నారని అర్ధం అవుతోందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు.
Read Entire Article