ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలును విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు.. కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు.. రూ.7168 కోట్లతో 39.6 కిలోమీటర్ల మేర మెట్రో మూడో ఫేజ్ను నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే రెండో దశ మెట్రోకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలపడంతో.. మూడో దశపై సర్కార్ దృష్టి పెట్టింది.