Nara Lokesh: మరో హామీ నెరవేర్చిన లోకేష్.. ఇకపై ఉచితంగానే..

1 year ago 18
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఓ హామీని ఇచ్చారు. మంగళగిరిలోని ఎకో పార్కులో ఉదయం పూట చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. వీరంతా ఎకో పార్కులో వాకర్స్‌కు ఎంట్రీ ఫీజు తొలిగించాలంటూ ఎన్నికల సమయంలో నారా లోకేష్‌ను కోరారు. దీనిపై అప్పట్లో హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా మాట నిలబెట్టుకున్నారు. అయితే ఎకో పార్కులో ఎంట్రీ ఫీజును తొలగించడం వీలుకాదని ఫారెస్ట్ అధికారులు చెప్పటంతో.. ఆ మొత్తాన్ని నారా లోకేష్ చెల్లించారు. దీంతో ఏడాది పాటు వాకర్స్‌కు మంగళగిరి ఎకో పార్కులోకి ప్రవేశ రుసుం చెల్లించాల్సిన పని ఉండదు.
Read Entire Article