Nara Lokesh amaravati speech: వంద పాకిస్థాన్‌లకు సమాధానం చెప్పే మిసైల్ మోదీ.. గడ్డి కూడా పీకలేరు..

1 year ago 39
అమరావతి ప్రారంభోత్సవంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రస్తావించిన నారా లోకేష్.. ఒక్క పాకిస్థాన్‌ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరని నారా లోకేష్ అన్నారు. భారతదేశం వద్ద నరేంద్ర మోదీ అనే మిసైల్ ఉందని లోకేష్ చెప్పుకొచ్చారు. నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌ దిమ్మ తిరగడం ఖాయమని.. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరంటూ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల ఉగ్రదాడి జరిగిన సంగతి తెలసిందే. ఈ ఘటనలో 26 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.
Read Entire Article