Nandamuri Balakrishna: బాలయ్య మంచి మనసు.. కష్టాల్లో ఉన్న అభిమానికి ఫోన్..

1 year ago 25
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మంచి మనసు చాటుకున్నారు. గాయపడిన తన అభిమానిని ఫోన్ ద్వారా పరామర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి చెందిన మూర్తి యాదవ్ బాలకృష్ణ వీరాభిమాని, టీడీపీ నేత కూడా. అయితే ఇటీవల మూర్తి యాదవ్ ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఫోన్ ద్వారా ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీనిపై మూర్తి యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.
Read Entire Article