Mohan Babu Donation: వరద బాధితులకు మంచు ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబుకు అందించిన మోహన్ బాబు

1 year ago 33
ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు రూ.25 లక్షలు విరాళంగా అందించారు. శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల తరుఫున రూ.25 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి మోహన్ బాబు కుటుంబం విరాళంగా అందించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు విరాళం తాలూకు చెక్ అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకూ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.425 కోట్లు విరాళంగా సమకూరాయి.
Read Entire Article