Madanapalle Leopard Case: చిరుత మృతి కేసులో ట్విస్ట్.. స్థానికుల నిరసన

1 year ago 25
అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ పొన్నూటిపాలెంలో రైతులు ఏర్పాటుచేసిన ఉచ్చులో పడి చిరుత మృతి ఘన కలకలం రేపింది. చిరుత మృతి చెందిన కేసులో అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు మదనపల్లె పోలీసులు ఇద్దరు రైతులు, ఒక రైతు కూలీపై కేసు నమోదు చేశారు. రెడ్డెప్పరెడ్డి అనే రైతు పొలంలో ఏర్పాటుచేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుని మృతి చెందింది. అడవిపందుల కోసం రెడ్డెప్పరెడ్డి ఈ ఉచ్చు ఏర్పాటుచేశాడని అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇతనితో పాటు పక్కపొలం యజమాని వెంకటరమణారెడ్డి, ఈ పొలాల్లో పనిచేసే రైతు కూలీ గంగాధర్‌‌ను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తమవారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని గ్రామస్థులు అంటున్నారు. ఫారెస్ట్ అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రైతులను కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ అధికారులను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రెడ్డెప్పరెడ్డి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుగజేసుకుని తమవారిని విడిపించాలని కోరారు.
Read Entire Article