IAS Postings in AP: తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్.. ఆమ్రపాలికి ఏ పోస్ట్ అంటే?

1 year ago 37
ఇటీవలే తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌లకు వివిధ శాఖల్లో ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే మరో ఐఏఎస్ ఆఫీసర్ రొనాల్డ్ రాస్‍‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వనట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన ఆమ్రపాలికి ఏపీ టూరిజం ఎండీగా బాధ్యతలు అప్పగించారు. అలాగే వైదారోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణను నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Entire Article