Hyderabad: కిలో నకిలీ బంగారు బిస్కెట్లు ఇచ్చి, రూ.1.6 కోట్ల విలువైన నగలు కాజేశాడు

3 months ago 20
ఏపీలోని ఒక ప్రముఖ వ్యక్తికి వ్యక్తిగత సహాయకుడిగా నటిస్తూ రూ.1.60 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కొట్టేశాడు. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో నగల దుకాణం నడిపే లక్ష్మీ కావ్యకు శ్రీనాథ్ రాఠి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాడు. ప్రముఖురాలి పీఏనని చెప్పుకుంటూ పెద్ద మొత్తంలో తమ దగ్గర బంగారు బిస్కెట్లు ఉన్నాయని చెప్పాడు. వాటికి సమానమైన ఆభరణాలను ఇవ్వవాలని కోరాడు. మూడుసార్లు కొద్ది మొత్తంలో నగలు తీసుకుని, అసలైన బంగారు బిస్కెట్లు ఇచ్చి.. నాలుగోసారి మాత్రం ఆమెకు పంగనామం పెట్టాడు.
Read Entire Article