హైదరాబాద్లోని ప్రశాసన్నగర్లో విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజను నేపాలీ పని మనిషి కల్పన తన అనుచరులతో కలిసి హత్య చేసి దోపిడీకి పాల్పడింది. యజమాని ఊరు వెళ్లిన సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితురాలి చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు పది బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. పని మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.