Hyd: చుక్కేసి చిక్కితే చుక్కలే.. లైట్ తీసుకున్నారో జైలుకే..

7 months ago 19
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వీకెండ్‌ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మొత్తం 431 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. మద్యం సేవించిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి.. కోర్టుకు హాజరుపరచనున్నారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే.. భారతీయ న్యాయ సంహిత - సెక్షన్ 105 కింద 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. గత వారం పరిష్కరించబడిన 320 కేసులలో 21 మందికి జైలు శిక్ష పడింది.
Read Entire Article