హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డులతో దుమ్మురేపుతోంది. కేపీహెచ్బీలో ఎకరా ఏకంగా 70 కోట్లు పలికింది. హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించగా.. ప్రముఖ సంస్థలు పోటీపడి మరీ ఈ స్థలాన్ని దక్కించుకున్నాయి. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎకరా రూ. 70 కోట్ల చొప్పున మెుత్తం 7 ఎకరాల 33 గుంటల స్థలాన్ని రూ. 547 కోట్లకు దక్కించుకుంది.