Hyd: ఆ భూములు కోల్పోయే యజమానులకు.. 400 శాతం పరిహారం..

4 months ago 17
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, నాళాల విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన టీడీఆర్ (TDR) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు, తమ పట్టా భూములను వదులుకునే యజమానులకు భారీ పరిహారాన్ని ఆఫర్ చేస్తోంది. చెరువుల ఎఫ్.టి.ఎల్ పరిధిలో భూమి కోల్పోయిన వారికి 200 శాతం, బఫర్ జోన్ లో 300 శాతం, నాళాల వెడల్పు పెంపునకు భూమి ఇస్తే 400 శాతం టిడిఆర్ సర్టిఫికెట్లు అందజేస్తారు. వీటిని మార్కెట్లో విక్రయించుకునేలా బిల్డింగ్ నియమాల్లో మార్పులు చేశారు. పది అంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాల్లో 10 శాతం టీడీఆర్ వాడటం తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు బాధితులకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
Read Entire Article