హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 8 వరుసలుగా విస్తరించాలని ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్హెచ్ఏఐని కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు తెలంగాణలో భూసేకరణ పూర్తయితే రీజినల్ రింగ్ రోడ్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.