ఇద్దరు కుమార్తెల పెళ్లి కోసం రూపాయి రూపాయి పోగు చేసి ఆ తల్లి 30 తులాల బంగారం, 50 తులాల వెండిని దాచిపెట్టుకుంది. రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుండటంతో నైట్ డ్యూటీకి వెళ్లాల్సి వచ్చింది. ఎప్పటి నుంచి ఆమె ఇంటిపై రెక్కీ వేసిన దొంగలు ఆమె డ్యూటీకి వెళ్లగానే ఇంట్లోకి ప్రవేశించి.. సొమ్మంతా అపహరించారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుబెట్టారు. ఈ దారుణ ఘటన గుంతకల్లు మిలటరీ కాలనీ సమీపంలోని కొయినగర్లో చోటుచేసుకుంది.