రాజధాని పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో తొలుత కేవలం జీహెచ్ఎంసీకి మాత్రమే నవంబరులో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అక్టోబరు రెండో వారానికి ఓటరు సవరణ ముగియనుండగా.. కొత్త డివిజన్ల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బీసీ సర్వే నివేదికల ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని పునర్విభజన కారణంగా పొలిటికల్ ముఖచిత్రం మారడంతో ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసి ఆ తర్వాతే సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం యోచిస్తోంది.