ఇదొక అంతులేని విషాద గాథే.. భర్త చనిపోయిన మరుసటి రోజే భార్య కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన పదకొండేళ్ల పాటు ఆ ఇద్దరూ అన్యోన్యంగా బతికారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిసిమెలిసి ఉన్నారు. అప్పుల రూపంలో ఆ చిన్న కుటుంబంలోకి కష్టాలు మొదలయ్యాయి. అప్పుల బాధ తాళలేక అతను ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో కన్నుమూస్తే.. అతను లేని బతుకు వద్దనుకుని ఆమె కూడా ఇంట్లోనే చీరకు ఉరేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.