రాయలసీమకు ప్రతిష్టాత్మక రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టు వస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లాలోని సత్యవేడు మండలంలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 2500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటా 9 లక్షల బైక్లను ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నెలకొల్పనున్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడుతో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధుల బృందం సోమవరం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ముందుగా అనుకున్న 24 నెలలు కాకుండా 18 నెలల్లోనే ప్రాజెక్టు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు.. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిధులకు సూచించారు.