బుచ్చిరెడ్డిపాలెం ఏఓ శ్రీహరి హత్య కేసులో జిల్లా ఎస్పీ అనిత సీరియస్ అయ్యారు. ఏఓ మృతిపై అనుమానాలు ఉన్నపపటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి గుండెపోటుగానే నిర్ధారించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ పోలీస్ స్టేషన్లో ఉన్న 23 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో పెద్ద మొత్తం డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సీఐ శ్రీనివాసరావును కూడా వీఆర్కు పంపడం చర్చనీయాంశంగా మారింది.