ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్.. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో వర్షాలు కురవనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో మరో వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మరోవైపు మంగళవారం రోజున పలు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.