AP News: ఏపీలో వరద బాధితులకు భారీ విరాళం.. ఏకంగా రూ.120 కోట్లు

1 year ago 43
AP Employees JAC donation to CM Relief Fund: ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు సహాయం అందించేందుకు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు ముందుకువచ్చారు. వరద బాధితుల కోసం ఒకరోజు బేసిక్ పే ద్వారా రూ.120 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తమ అంగీకార పత్రాన్ని అందజేశారు. అటు ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు కూడా తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా అందించేందుకు ముందుకు వచ్చారు. అటు తెలంగాణలోనూ ఉద్యోగులు వరద బాధితులకు వంద కోట్ల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Entire Article