AP IPS Officers Suspend: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్

1 year ago 43
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌‌గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్నిని సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముంబయి నటి కాదంబరి జత్వానీ కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపైనా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.
Read Entire Article